News February 1, 2025
యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్నరగ్కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 1, 2025
విజయనగరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

విజయనగరం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, పండు పడాల్ వంటి నాయకుల త్యాగాలను స్మరించారు. విద్యార్థులతో మెగా ర్యాలీ, మొక్కలు నాటడం, ఆటల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 15న జరిగే మెగా ఈవెంట్కు సిద్ధంగా ఉన్నామని గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు.
News November 1, 2025
సంగారెడ్డి: 6, 7 తేదీల్లో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు

జిల్లా స్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 6, 7 తేదీలలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ పోటీలు హైదరాబాద్లోని టీఎస్ఐఆర్డీ రాజేంద్ర నగర్లో జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
News November 1, 2025
ఇది శవ రాజకీయం తప్ప మరేమీ కాదు: TDP

కాశీబుగ్గలోని తమ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేల మంది వస్తుంటారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదని నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు. రద్దీ ఇంత ఉంటుందని తెలియక పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందించింది. ‘ఇంత మంది ఎప్పుడూ రాలేదని’ ఆలయ ధర్మకర్తలే అంటుంటే ముందస్తు సమాచారం ఉంది అంటూ శవ రాజకీయం చేసే పార్టీ ఏపీలో ఉండటం దురదృష్టకరమని TDP మండిపడింది.


