News February 1, 2025
యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్నరగ్కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 1, 2025
పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.
News November 1, 2025
GWL: ధర్మవరం బీసీ హాస్టల్ ఘటనపై విచారణ: డిప్యూటీ డైరెక్టర్

ఇటిక్యాల మండలం ధర్మారంలోని బీసీ బాలుర వసతి గృహంలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. చికిత్స పొందుతున్న విద్యార్థులను బీసీ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ అలోక్ పరామర్శించారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఆయన విద్యార్థులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
News November 1, 2025
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు

భద్రాద్రి జిల్లాలో రోడ్ల దయనీయ స్థితి, డిఎంఎఫ్టి నిధుల దుర్వినియోగంపై నిరసనగా నవంబర్ 7న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టి ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు.


