News October 4, 2024

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ సతీశ్

image

ప్రజలు, పోలీసులు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. చేబ్రోలు మండలంలోని గొడవర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆయన వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా కలిసి మెలసి ఉంటే ఎటువంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Similar News

News November 8, 2025

GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

image

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.

News November 8, 2025

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.

News November 8, 2025

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.