News February 27, 2026
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్గా మారాలన్నారు.
Similar News
News April 12, 2026
విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.


