News March 29, 2025
యూట్యూబర్ శంకర్పై కేసు నమోదు

HYD అంబర్పేట పీఎస్లో యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్ది నల్గొండ జిల్లా.
Similar News
News July 8, 2025
పవన్ కళ్యాణ్ ఆగ్రహం

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.
News July 8, 2025
కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News July 8, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.