News February 21, 2025
యూట్యూబర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

గుంతకల్లు మండలం బుగ్గ సంగాల గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని కసాపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ట్రాక్టర్, బైకు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు తెలిపారు. భూ వివాదంతోనే హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News February 23, 2025
కసాపురం అంజన్నకు వెండి రథోత్సవం

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచి ఉత్సవమూర్తికి విశేష పుష్పలతో అలంకరించి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News February 22, 2025
అనంతపురం టుడే టాప్ న్యూస్

☛ రేపు అనంతపురం జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు యథాతథం
☛ అనంతపురం జిల్లాలో 144 సెక్షన్
☛ అనంతపురం హైవేపై రోడ్డు ప్రమాదం
☛ గుత్తి బావిలో పదో తరగతి విద్యార్థి మృతి
☛ ఈ నెల 25న రాయదుర్గంలో జాబ్ మేళా
☛ అనంతపురం JNTU బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
☛ పరిటాల శ్రీరాంను అభినందించిన జేసీ
News February 22, 2025
గ్రూప్-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.