News September 21, 2024

‘యూపీఎస్సీ మెయిన్స్‌కు 128 మంది హాజరు’

image

ఎస్‌ఆర్‌ఆర్‌&సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన యూపీఎస్సీ మెయిల్‌ పరీక్షకు ఏడుగురు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. 135 మంది అభ్యర్థులకు గానూ 128 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు.

Similar News

News October 30, 2025

కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

image

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్‌కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News October 30, 2025

అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.

News October 29, 2025

కృష్ణా: 46,357 హెక్టార్లలో పంట నష్టం

image

తుపాన్ ధాటికి జిల్లాలో 46,357 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. 427 గ్రామాల పరిథిలో ఈ పంట నష్టం జరగ్గా 56,040 మంది రైతులు నష్టపోయారన్నారు. 45,040 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ 288 హెక్టార్లలో, 985 హెక్టార్లలో మిముము, 43 హెక్టార్లలో పత్తి పంట నష్టపోయిందన్నారు.