News April 11, 2025
యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం

కడప: కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59వ కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. వైవీయూకు ఈ పతకం ఐదవది. వర్సిటీ క్రీడా బోర్డు సహాయ సహకారాలు అందజేయడం ద్వారా ఈ పతకం సొంతమైనట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ రామ సుబ్బారెడ్డి తెలిపారు.
Similar News
News December 24, 2025
కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫొటో

క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫొటోలో విజయమ్మ, దివ్యారెడ్డి, భారతి రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.
News December 24, 2025
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా “స్మార్ట్ కిచెన్” నిర్మించాలి: కలెక్టర్ శ్రీధర్

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. మంగళవారం చెన్నూరు మండలం కొండపేటలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ను పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి 41 పాఠశాలలకు భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.
News December 24, 2025
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా “స్మార్ట్ కిచెన్” నిర్మించాలి: కలెక్టర్ శ్రీధర్

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. మంగళవారం చెన్నూరు మండలం కొండపేటలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ను పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి 41 పాఠశాలలకు భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.


