News January 28, 2025
రంగంపేట: స్మశానవాటికలో స్కూల్ నిర్మాణంపై ఫిర్యాదు

రంగంపేట రెవెన్యూ కార్యాయంలో అధికారులు సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పాతకోటపాడులోని సర్వే నంబర్ 44లో 2.71ఎకరాలను పలు సామాజిక వర్గాలు శ్మశానంగా వినియోగిస్తున్నాయి. అదే స్థలాన్ని హైస్కూల్ నిర్మాణానికి కేటాయించడంపై సహించేది లేదని తహశీల్దార్ కోను అనసూయకు ఇండియన్ యాక్ట్స్ ఆవెర్నెస్ వలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుందేటి వెంకట రమణ వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 17, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.
News February 17, 2025
RJY: బాలికపై వేధింపులు.. నలుగురిపై పోక్సో కేసు నమోదు

బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులకు గురి చేసిన నలుగురు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. బొమ్మూరుకు చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె బంధువులు యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News February 17, 2025
RJY: ఎన్టీఆర్ను పరిచయం చేసిన నిర్మాత ఇకలేరు

ఎన్టీఆర్, ఘంటసాల వంటి సినీ ప్రముఖులను వెండితెరకు పరిచయం చేసిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం హైదరాబాద్లో మరణించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం గ్రామంలో 1924లో జన్మించారు. మహిళలు బయటకు రాని కాలంలో భర్తతో కలిసి 1936 శోభనాచలం స్టూడియోను స్థాపించి ‘సతీ అనుసూయ’ చిత్రాన్ని నిర్మించారు. 1948లో మనదేశం సినిమాతో ఎన్టీఆర్ను తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు.