News May 12, 2024

రంగారెడ్డి: ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా: కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు, రిటర్నింగ్ అధికారుల తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లా వ్యాప్తంగా 1,534 కేసుల్లో రూ.49.72 కోట్లకు పైగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా ఉంటుందని అన్నారు.

Similar News

News February 19, 2025

HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.

News February 18, 2025

HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

image

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు‌లో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.

News February 18, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం 

image

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్‌ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.

error: Content is protected !!