News March 29, 2024

రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ వాసి

image

రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా ర్యాలమడుగు వాసి కృష్ణ గెలుపొందారు. గ్రామానికి చెందిన కృష్ణ 18 ఏళ్లుగా అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2270 ఓట్లలో 1134 ఓట్లు సాధించి గెలుపొందారు. మెదక్ మండలం ర్యాలమడుగు వాసి గెలుపొందడం పట్ల గ్రామస్తులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

News November 26, 2025

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

image

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.