News January 25, 2025
రంగు రంగుల దీపాలతో ముస్తాబైన MHBD కలెక్టరేట్

మహబూబాబాద్లో రేపు జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ రంగు రంగుల తోరణాలతో, జాతీయ జెండా రంగుల ప్రకాశాలతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లకు అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం మొత్తం కూడా మూడు రంగుల జెండా ఆకారంలో లైట్లు ఏర్పాటు చేసి కలెక్టరేట్ను అధికారులు ముస్తాబు చేశారు.
Similar News
News November 22, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు NRCలు: మంత్రి

నేషనల్ హెల్త్ మిషన్ కింద పార్వతీపురం మన్యం జిల్లాలో 5 NRCలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలు అందించేందుకు వీలుగా న్యూట్రిషన్ రిహబిలిటేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. 5 పడకలతో సాలూరు, పాలకొండ, భద్రగిరి, కురుపాం, చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 22, 2025
పాపాల నుంచి విముక్తి కోసం..

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 22, 2025
మావోయిస్టు దామోదర్ పేరుతో ఫోన్ కాల్స్ కలకలం!

మావోయిస్టు అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావ్@ దామోదర్ పేరిట కొందరు వ్యాపారులకు ఫోన్ చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్ చేసి డబ్బులు అడగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని జిల్లాలో అక్కడక్కడ స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం. దామోదర్ పేరుతో ఫోన్ ఎవరు చేశారు? దామోదర్ ఎక్కడున్నాడనే విషయంపై సందిగ్ధం నెలకొంది.


