News April 14, 2025
రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ రద్దు

రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్ని రద్దు చేశామని ITDA. PO. సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో గ్రీవెన్స్ రద్దు అయ్యిందని తెలిపారు. రంపచోడవరం డివిజన్లో ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.
Similar News
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.
News November 20, 2025
ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 20, 2025
అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.


