News February 25, 2025

రంపచోడవరం: ‘జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు’

image

కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్, గుడ్ల అమ్మకాలు మంగళవారం నుంచి చేసుకోవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు షాపు ఓనర్లు పర్యవేక్షించాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన ప్రాంతాల నుంచి కోళ్లను తరలించవద్దన్నారు.

Similar News

News October 18, 2025

మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

News October 18, 2025

సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

image

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.

News October 18, 2025

ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

image

ధంతేరస్‌ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.