News February 25, 2025
రంపచోడవరం: ‘జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు’

కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్, గుడ్ల అమ్మకాలు మంగళవారం నుంచి చేసుకోవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు షాపు ఓనర్లు పర్యవేక్షించాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన ప్రాంతాల నుంచి కోళ్లను తరలించవద్దన్నారు.
Similar News
News December 3, 2025
VJA: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్సింగ్నగర్కు చెందిన ఓ బాలికపై 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.
News December 3, 2025
WGL: సీఎం సభపై భరోసా!

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 3వ దశ నామినేషన్లకు చేరుకొవడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలను ప్రస్తావించడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు. నర్సంపేటలో ఈ నెల 5న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సభనే తమకు మైలేజని అభ్యర్థులంటున్నారు.
News December 3, 2025
ఖమ్మం సర్కారీ స్కూళ్ల అద్భుత ప్రదర్శన, కలెక్టర్ ప్రశంసలు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్య ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల నైపుణ్యాలు తోడవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల సర్వేలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యధిక స్కోర్ సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణం అని కలెక్టర్ తెలిపారు.


