News February 25, 2025
రంపచోడవరం: ‘జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు’

కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్, గుడ్ల అమ్మకాలు మంగళవారం నుంచి చేసుకోవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు షాపు ఓనర్లు పర్యవేక్షించాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన ప్రాంతాల నుంచి కోళ్లను తరలించవద్దన్నారు.
Similar News
News March 24, 2025
NZB: ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది గైర్హాజరు: డీఈవో

2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.
News March 24, 2025
ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్

APలో తమిళ మీడియం పాఠశాలలు ఉండటం సంతోషమని BJP నేత తమిళి సై చేసిన ట్వీట్కు DyCM పవన్ స్పందించారు. ‘చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. AP భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది. తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో 1,610 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.