News January 30, 2025

రంప: అనంత బాబు కేసుపై పునః విచారణ చేయాలి

image

దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన MLC అనంత బాబు కేసుపై పునః విచారణ జరపాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు ను కలసి వినతి పత్రం అందజేశారు. సుబ్రహ్మణ్యం వృద్ధ తల్లిదండ్రులకు చట్ట ప్రకారం రావలసిన ఆర్థిక సహాయం అందించడంతో అతని తమ్ముడికి ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Similar News

News February 25, 2025

RJY: ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

image

పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News February 24, 2025

రాజమండ్రి: కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

కేంద్ర బడ్జెట్ 2025 మేధావుల సమావేశం రాజమండ్రిలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీ పురందీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2025

తూ.గో. జిల్లా TODAY TOP NEWS

image

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్‌ని గెలిపించండి’

error: Content is protected !!