News April 5, 2025
రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి

రంపచోడవరం మండలం పెద్దకొండకి చెందిన పి.బాబురావు (46) అదే గ్రామం శివారున ఉన్న చెరువులో జారిపడి మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువులోకి దిగి, అదుపు తప్పి లోపలికి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 7, 2025
గుంటూరులో మెగా జాబ్ మేళా

గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహణకు GMC సిద్ధమవుతోంది. స్మార్ట్ టెక్స్, జీఎంసీ సంయుక్తంగా ఈనెల 9న విజ్ఞాన మందిరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతిపైగా అర్హత కలిగిన నిరుద్యోగుల కోసం 50కుపైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం నుంచి తమ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వర్క్షాప్ ఉదయం 9 నుంచి ప్రారంభవుతుంది.
News April 7, 2025
నేరేడుగొమ్ము: పురుగు మందు తాగి ఒకరి సూసైడ్

ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిపల్లి ఎస్ఐ మేరకు.. నేరేడుగొమ్ము మండలం చిన్నమునిగల్కి చెందిన అరవింద్(27) అప్పులు బాధతో పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో పురుగు మందు తాగాడు. అనంతరం భార్యకు వీడియో కాల్ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యలు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News April 7, 2025
ఆరడుగుల బస్సులో ఏడడుగుల కండక్టర్.. వైరలవడంతో!

TG: తన ఎత్తు కారణంగా కండక్టర్గా పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అహ్మద్పై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. 7ft ఉన్న అహ్మద్ మెహదీపట్నం(HYD) డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. బస్సులోపల 6.4ftల ఎత్తే ఉండటంతో మెడ వంచి ఉద్యోగం చేయడంతో మెడ, వెన్నునొప్పి వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇది CM రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి RTCలో సరైన ఉద్యోగం ఇవ్వాలని RTC ఎండీ సజ్జనార్కు సూచించారు.