News March 15, 2025

రంప : పడిపోయిన టమాటా ధర

image

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.

Similar News

News December 17, 2025

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

image

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే సిద్ధమైంది. స్లీపర్, ఏసీ 3 టైర్‌లో ప్రయాణికులు 40Kgలు, 2nd AC ప్యాసింజర్లు 50Kgలు, 1st క్లాస్‌ ప్రయాణికులకు 70Kgల వరకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. జనరల్‌ బోగీలో ప్రయాణించే వాళ్లు 35Kgల లగేజీ తీసుకెళ్లవచ్చు. 5-12 ఏళ్ల పిల్లలకు ఆ పరిమితిలో 50% లేదా గరిష్ఠంగా 50Kgల వరకు అనుమతి ఉంటుంది. పరిమితి మించితే అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

News December 17, 2025

మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారుగా: కాంగ్రెస్ MLA

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నట్లు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ‘ఫిరాయింపులపై <<18595871>>BRS<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గతంలో మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. తలసాని, సబితలకు మంత్రి పదవులూ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. తీర్పు నచ్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

News December 17, 2025

బాపట్లలో పొగాకు గోడౌన్‌ను పరిశీలించిన ఏపీ మార్కెట్ ఛైర్మన్

image

ఏపీ మార్కెట్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు బుధవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని పొగాకు గోడౌన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. గోడౌన్‌లోని మౌలిక వసతులు పొగాకు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్ కరుణశ్రీ ఉన్నారు.