News April 16, 2025

రక్తహీనతను నివారించాలి: డీఎంహెచ్వో కోటాచలం

image

రక్తహీనతను నివారించేందుకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్వో కోటాచలం అన్నారు. సూర్యాపేటలో ఐడీఓసీ ఫార్మసిస్టు సమావేశంలో డీఎంహెచ్వో మాట్లాడారు. రక్తహీనత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం ద్వారా రక్తహీనతను ప్రారంభ దశలోనే నివారించవచ్చన్నారు. రక్తహీనత ఉన్న వారిని గుర్తించి పోషకాహారం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Similar News

News December 3, 2025

137 బస్సుల్లో సాంకేతిక లోపాలు గుర్తింపు: DTO

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పలు విద్యా సంస్థలకు చెందిన 260 బస్సులను ఇంతవరకు తనిఖీ చేసామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆ బస్సుల్లో 137 బస్సుల్లో సాంకేతికపరమైన లోపాలు గుర్తించామన్నారు. ఈ లోపాలను వారం రోజుల్లోగా సరిచేయించాలని అక్కడికక్కడే స్కూల్ యజమాన్యాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు.

News December 3, 2025

పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

image

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.

News December 3, 2025

తిరుమల: డిసెంబర్ 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

image

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబర్ 5వ తేదీన ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌‌కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.