News February 18, 2025
రక్తాన్ని అందుబాటులో ఉంచుతాం: నంద్యాల కలెక్టర్

అత్యవసర వైద్యం కోసం నంద్యాలకు వచ్చే వారి కోసం రెడ్క్రాస్ ద్వారా రక్తం అందుబాటులో ఉంచుతామని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కేసీ కెనాల్ కాంపౌండ్లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లు, కమిటీ సభ్యులకు ఆమె పలు సూచనలిచ్చారు.
Similar News
News November 23, 2025
బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
News November 23, 2025
కోహెడ: మహిళలు శక్తి స్వరూపులు: కలెక్టర్

మహిళలు శక్తి స్వరూపులని ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాల్గొని ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమై ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలో నేడు మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
News November 23, 2025
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం: MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డులకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి ఎస్ఈసీకి పంపినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మొదటి దశలో 155 పంచాయతీలు, రెండో దశలో 158, మూడో దశలో 169 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.


