News February 18, 2025

రక్తాన్ని అందుబాటులో ఉంచుతాం: నంద్యాల కలెక్టర్

image

అత్యవసర వైద్యం కోసం నంద్యాలకు వచ్చే వారి కోసం రెడ్‌క్రాస్ ద్వారా రక్తం అందుబాటులో ఉంచుతామని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లు, కమిటీ సభ్యులకు ఆమె పలు సూచనలిచ్చారు.

Similar News

News November 8, 2025

సిరిసిల్ల: ‘యువత లక్ష్యాన్ని నిర్ణయించి ముందుకు సాగాలి’

image

యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించి, దానిని సాధించడానికి ముందుకు సాగాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో నిర్వహించిన 29వ జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

News November 8, 2025

సిరిసిల్ల: ‘న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలి’

image

ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని, సమస్యలను శాంతియుతంగా, త్వరితంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

News November 8, 2025

మేడారం భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

image

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. జాతరలో వైద్యశాఖ ముందస్తు ప్రణాళికపై జిల్లా కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎంహెచ్‌వోతో కలిసి సమీక్ష జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన పరికరాలు, బెడ్స్‌ను సమకూర్చుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం 108 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.