News August 21, 2024

రక్షా బంధన్‌.. ఆర్టీసీకి భారీగా ఆదాయం

image

రక్షా బంధన్‌ పర్వదినం ఆర్టీసీకి కలిసొచ్చింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో ఈ నెల 17 నుంచి 19 వరకు మొత్తం రూ.6.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మూడు రోజుల్లో మొత్తం 9,82,355 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. మొత్తం రీజియన్‌ పరిధిలో ఈ నెల 17న రూ.1.89కోట్లు, 18న రూ.2.02కోట్ల ఆదాయం రాగా.. అత్యధికంగా ఈనెల 19న రూ.2.55కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News December 3, 2025

నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్‌గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News December 3, 2025

NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

News December 2, 2025

నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.