News October 21, 2024
రఘునాథపల్లి: అన్నదమ్ములకు 7 ప్రభుత్వ ఉద్యోగాలు

ఓ రైతు కుటుంబంలోని అన్నాతమ్ముడు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన కౌడగాని మైసారావు-వినోధ దంపతులకు మధు, మనోజ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోజ్కి 3, చిన్న కుమారుడు మధుకి 4 ఉద్యోగాలు సాధించారు. కొందరు ఒక ఉద్యోగం సాధించడానికి తంటాలు పడుతుంటే, వీరు మాత్రం రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం.
Similar News
News October 12, 2025
వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.
News October 12, 2025
పదో వసంతంలోకి వరంగల్ జిల్లా..!

వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.
News October 12, 2025
WGL: బిల్లులు రాక.. మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఇబ్బందులు

జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 8 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు అందడం లేదు. మొత్తం 344 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 13,725 మంది విద్యార్థులు చదువుతుండగా వారికి ప్రతి రోజూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం చెల్లిస్తోంది. భోజనానికి బిల్లులను తరగతుల వారీగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విడుదల చేస్తోంది.