News April 14, 2025
రఘునాథపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ముందున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఐనప్పటికీ డ్రైవర్ మృతి చెందాడు. కారు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 4, 2026
తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
News January 4, 2026
రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News January 4, 2026
నా అన్వేష్ కేసులో కొత్త సెక్షన్లు

TG: నటి, BJP నేత కరాటే కళ్యాణి ఫిర్యాదుతో యూట్యూబర్ <<18721474>>నా అన్వేష్<<>>పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ FIRలో మరిన్ని సెక్షన్స్ జోడించాలని ఆమె పోలీసులను కోరారు. ‘అన్వేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అతడో దేశద్రోహి. మొన్నటి FIRలో IT సెక్షన్ 69(A) కూడా చేర్చాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. అతడి యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలని కోరాం’ అని తెలిపారు.


