News March 4, 2025
రఘునాథపాలెం: యువకుడి ఆత్మహత్య.. వ్యక్తి అరెస్టు

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
Similar News
News December 16, 2025
KMM: నాడు టీడీపీ నుంచి భర్త.. నేడు కాంగ్రెస్ నుంచి భార్య

నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలుపొందారు. పదేళ్ల క్రితం, 2013లో టీడీపీ తరఫున ఇదే పంచాయతీ సర్పంచ్గా ఆమె భర్త మన్నె నగేష్ విజయం సాధించారు. పార్టీ మారినా, పదేళ్ల తర్వాత మళ్లీ వారి కుటుంబం నుంచే సర్పంచ్గా రాజశ్రీ ఎన్నిక కావడం స్థానికంగా ఆసక్తిని పెంచింది.
News December 16, 2025
63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలు: సీపీ

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మద్యం, డబ్బులు, కానుకల పంపిణీపై ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయన్నారు. పౌరులు సమన్వయం పాటించి నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.
News December 16, 2025
63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలు: సీపీ

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మద్యం, డబ్బులు, కానుకల పంపిణీపై ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయన్నారు. పౌరులు సమన్వయం పాటించి నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.


