News April 8, 2024
రఘునాథ్పల్లి: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ఫతేషాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ ఉమేశ్(28) జనగామలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయ భూమి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలి: కలెక్టర్

మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలందరికీ రెండు రకాల చీరలను అందిస్తున్నారని, అందరూ సమానత్వమనే భావన కలిగి ఉండేలా మొత్తం ఈ రంగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకుంది సాధించగలుగుతారని అన్నారు.
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.


