News April 15, 2025

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వాయిదా

image

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని కోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. 

Similar News

News October 24, 2025

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు: డీఆర్‌ఓ

image

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి నివేదికను ఎన్నికల సంఘానికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని ఆ వివరాలను అందించాలని కోరారు.

News October 24, 2025

అధికారుల నిర్లక్ష్యమా.. లేక విద్యార్థులపై చిన్న చూపా.?

image

గత 14 నెలలుగా నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక అధికారుల తీరు మారటం లేదు. ఈ నెల 13న MSC కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించిన వర్సిటీ అధికారులు, 23న రీవాల్యుయేషన్‌కు చివరి తేదీగా పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్సైట్‌లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలితాలు విడుదల తర్వాత మార్కులు వెబ్సైట్‌లో పెట్టకపోవడం ఎవరి నిర్లక్ష్యంగా భావించాలి.?

News October 24, 2025

గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

image

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.