News December 13, 2024
రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట

రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. కోరుట్ల, కరీంనగర్, మల్కాజిగిరి PSలో కేసుతో పాటు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయన ఓ పుస్తకం రాయడంతో నమోదైన కేసులన్నీ రాజ్యాంగపరిధిలోని భావ వ్యక్తీకరణకిందికే వస్తాయని హైకోర్టు పేర్కొంది. పుస్తకాన్ని బ్యాన్ చేయాలనే కేసును సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించినా, రచయితకు శిక్ష పడాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News November 14, 2025
HYD: ఉ.11.30 గంటల్లోపే విజేతపై క్లారిటీ!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనుండగా మొదటి గంటన్నరలోపే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత EVMలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉ.11.30లోపు విజేత ఎవరో క్లారిటీ రావొచ్చని అంచనా. గెలుపుపై అధికార కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష BRS ధీమా ఉండగా పట్టు నిలుపుకునేందుకు BJP చూస్తోంది.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్ జరిగేది ఇలాగే!

మరో 2 గంటల్లో జూబ్లీహిల్స్ కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మొదట షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత వెంగళ్రావునగర్, రహమత్నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కింపుతో పూర్తికానుంది. షేక్పేట్-31,182, రహమత్నగర్-40,610, బోరబండ-29,760, ఎర్రగడ్డ-29,112 అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి బస్తీ ప్రజలే అభ్యర్థి విజయంలో కీలకంగా మారనున్నారు.
News November 13, 2025
HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.


