News April 15, 2025

రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

image

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?

Similar News

News December 5, 2025

సీఎం ఓయూ పర్యటన వాయిదా

image

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.

News December 5, 2025

ఇసుక త్రవ్వకాలు రవాణా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిలువలు, ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలపై ఆయన అధికారులతో చర్చించారు.

News December 5, 2025

అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది: సీఎం

image

అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. భామినిలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కూడా విద్యను అత్యున్నత స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పిల్లలు భారం కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందింస్తుదన్నారు.