News April 15, 2025
రజతోత్సవ సభతో వరంగల్లో BRS ఊపందుకోనుందా?

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?
Similar News
News December 7, 2025
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తోట నవీన్ ఖరారు..?

కాకినాడ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా తోట నవీన్ పేరు ఖరారైనట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తోట నవీన్ మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఎంపీ సానా సతీశ్ బాబు సిఫార్సుతో అధిష్ఠానం తోట నవీన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News December 7, 2025
NTR: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

శబరిమలై వెళ్లేవారికై విజయవాడ మీదుగా కొల్లం వరకు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న నం.07117 సిర్పూర్ కాగజ్నగర్-కొల్లం, 20న నం.07121 చర్లపల్లి-కొల్లం, 24న నం.07123 H.S. నాందేడ్-కొల్లం, 15న నం.07118 కొల్లం-చర్లపల్లి, 22, 26న నం.07122, నం.07124 కొల్లం-చర్లపల్లి మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
News December 7, 2025
ADB: లక్ష ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. మనమే గెలవాలె

పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు డబ్బు, మద్యం, సరుకులతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. నామినేషన్ల నుంచి ఖర్చు లెక్కలు పెరుగుతున్నాయి. ఓటర్లు కూడా తమ ఓటుకు ఎక్కువ ధర పలుకుతుండటంతో బేరసారాలకు దిగుతున్నారు. సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారింది. పగలంతా ప్రచారం చేసి రాత్రి అవ్వగానే ఓటర్లకు విందులు, వినోదాలు ఏర్పాటుచేస్తున్నారు. అందరినీ తమతోనే ఉంచుకుంటూ ప్రత్యర్థితో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.


