News April 15, 2025
రజతోత్సవ సభతో వరంగల్లో BRS ఊపందుకోనుందా?

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?
Similar News
News November 15, 2025
కామారెడ్డి జిల్లాలో చలి పంజా

కామారెడ్డి జిల్లాలో ప్రజలు చలితో బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా బీబీపేటలో 8.6°C నమోదు అయ్యింది. బొమ్మన్ దేవిపల్లి 8.9, నస్రుల్లాబాద్, గాంధారిలో 9, లచ్చపేట 9.5, ఎల్పుగొండ, డోంగ్లిలలో 9.6, బీర్కూర్, రామలక్ష్మణపల్లిలో 9.7, సర్వాపూర్ 10, మేనూరు 10.1, రామారెడ్డి 10.3గా నమోదయ్యాయి.
News November 15, 2025
పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.
News November 15, 2025
ములుగు: ప్రశ్నార్థకంగా మావోయిస్టుల గమ్యం!

మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. అగ్రనేతలతో పాటు, రాష్ట్ర కమిటీ, డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ నాయకులు లొంగిపోతుండడం ప్రశ్నార్థకంగా మారింది. 2025 లెక్కల ప్రకారం ఇప్పటివరకు 144 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, 499 మంది అరెస్టయ్యారు. ఇందులో 560 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో సీసీ కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, మరి కొంత మంది సరెండర్ బాట పట్టారు.


