News June 12, 2024
రజనీకాంత్తో ముచ్చటించిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూపర్ స్టార్ రజనీకాంత్తో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఉన్న రజనీని.. పాత పరిచయంతో కలిసి ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తున్న ఆయనతో మాట్లాడుతూ.. ‘సార్.. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు.. మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు’ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఇరువురూ ఒకే ఫ్లైట్లో గన్నవరం ఎయిర్ పోర్ట్కి వచ్చారు.
Similar News
News March 17, 2025
గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.
News March 17, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
News March 16, 2025
ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.