News January 22, 2025

రణస్థలం: బాలికపై యువకుడి అఘాయిత్యం

image

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు

News September 18, 2025

సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

image

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్‌లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 18, 2025

ఎచ్చెర్ల: పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ, B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చునన్నారు.