News July 6, 2024
రణస్థలం: మొదటి జీతాన్ని అమరావతికి విరాళం

తన మొదటి నెల జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తన జీతం చెక్కుని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి అందజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎంతో అవసరమని ఎంపీ కలిశెట్టి అభిప్రాయపడ్డారు.
Similar News
News November 4, 2025
శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని అరసవల్లికి చెందిన మాడుగుల. ఇందిరా (36) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News November 4, 2025
మెళియాపుట్టి: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..!

ప్రతిరోజూ ఏదోక చోట బస్సు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి (M) గొప్పిలిలో ప్రయాణికులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ వెళ్తున్న దృశ్యం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి:  అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు


