News September 10, 2024
రణస్థలం: వరద బాధితులకు రూ.80లక్షల చెక్కు అందజేత

విజయవాడ వరద బాధితుల కోసం మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీ విలేజ్ సర్వేయర్లు అసోసియేషన్ తరుపున రూ.80లక్షల చెక్కును అందజేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన మధు యూనియన్ నాయకులు అయ్యప్పలనాయుడు, కిరణ్తో కలిసి విజయవాడలో పవన్ కళ్యాణ్కు చెక్కును అందించారు. రాష్ట్రంలోని సర్వేయర్లు అందరూ ఒకరోజు వేతనాన్ని అందించినట్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్లుగా పాఠశాల ప్రాంగణాలు
News November 14, 2025
SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.
News November 14, 2025
నౌకా నిర్మాణ హబ్గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్ను నౌకా నిర్మాణ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.


