News January 29, 2025
రథసప్తమి ఏర్పాట్లపై TTD అదనపు ఈవో సమీక్ష

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
రాంబిల్లి: ఆరుగురు విద్యార్థులు అదృశ్యం

రాంబిల్లి మండలం వెంకటాపురంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వీరి ఆచూకీ లభించలేదు. దీంతో ట్రస్ట్ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఆచూకీ కోసం రాంబిల్లి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులు స్కూలు నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది.
News December 9, 2025
ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News December 9, 2025
ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


