News January 29, 2025
రథసప్తమి ఏర్పాట్లపై TTD అదనపు ఈవో సమీక్ష

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో పాల్గొన్నారు.
Similar News
News October 21, 2025
ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ నెల 24(శుక్రవారం)న భారత్ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు దీనికి మద్దతివ్వాలని కోరింది.
News October 21, 2025
అవతరించడం, అంతరించడం ప్రకృతి ధర్మం

ఈ సమస్త చరాచరసృష్టి ఈశ్వరమయం. భగవంతుని సృష్టి. దానికి కొన్ని ప్రకృతి ధర్మాలు, సూత్రాలు, నియమాలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. దానికి మానవుడే కాదు, చివరకు ఆ పరమాత్మ కూడా ఈ ప్రకృతి ధర్మాలను మార్చలేదు. మార్చడు. అవతరించుట, అంతరించుట తిరిగి అవతరించుట ప్రకృతి ధర్మం. ఇందులో పరమాత్మ మాత్రమే సత్య స్వరూపుడని వేదాలు చెబుతున్నాయి.
<<-se>>#VedicVibes<<>>
News October 21, 2025
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అప్పుడేం చేయాలి?

బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం. ఇది 48 నిమిషాల పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం. ఈ వేళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయం జ్ఞానం, శారీరక పెరుగుదలకు అనుకూలం. ఈ వాతావరణంలో ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దైవ శక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ సమయం.