News January 18, 2026
రద్దీ దృష్ట్యా రహదారులపై నిఘా: ఎస్పీ

సంక్రాంతి సెలవుల ముగింపుతో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం జిల్లా పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 450 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచామని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని కోరారు.
Similar News
News February 18, 2026
NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.
News February 18, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
News February 18, 2026
నల్గొండ: భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించి త్వరగా భూసేకరణ ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.


