News September 3, 2025
రవాణా శాఖ అధికారిగా కృష్ణారావు బాధ్యతలు

పశ్చిమగోదావరి జిల్లా రవాణా అధికారిగా కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తనిఖీలు, రహదారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News September 9, 2025
ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు: కలెక్టర్

ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. జిల్లాలో ఎరువులు కొరత లేదని, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.
News September 8, 2025
ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు: కలెక్టర్

జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మించి భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
News September 8, 2025
భీమవరం కలెక్టరేట్లో 192 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.