News March 24, 2025

రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం.. మీ కామెంట్

image

రాజకీయ చైతన్యం గల చిలకలూరిపేటలో పాలిటిక్స్ వేడెక్కాయి. నియోజకవర్గంలో బలమైన నేతయిన మర్రి రాజశేఖర్ TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు TDPలో చక్రం తిప్పిన సీనియర్ లీడర్, MLA పత్తిపాటి పుల్లారావు స్పందనెలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటు ప్రతిపక్షం నుంచి విడదల రజినీ బలంగా YCP గొంతు వినిపిస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి, మర్రి వర్సెస్ రజినీగా రాజకీయం రసవత్తరంగా మారింది.

Similar News

News December 10, 2025

SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

image

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.

News December 10, 2025

ఖమ్మంలో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News December 10, 2025

సిరిసిల్ల: రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్

image

జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండలాల్లో 85 సర్పంచ్, 758 వార్డు స్థానాలకు గాను 9 సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్, 519 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.