News July 9, 2024

రాంచంద్రంపురం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ మార్క్స్ నగర్‌లో ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్(40) సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. అతను గంజాయికి బానిసై ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.27,500 విలువ గల 1,100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం పోలీసులు తెలిపారు.

Similar News

News December 3, 2025

మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్‌లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

News December 3, 2025

తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

image

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.

News December 3, 2025

మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

image

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.