News February 12, 2025
రాంబిల్లి: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

అనకాపల్లి జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. రాంబిల్లి మండలానికి చెందిన బాలికపై యువకుడు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని సీఐ నరసింగరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు విచారణ నిర్వహించి సేనాపతి నాగేంద్ర అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. నాగేంద్ర ITI చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని, అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
News October 16, 2025
కర్నూలుకు పీఎం.. కడపకు భారీ పెట్టుబడులు

ఇవాళ ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ కడప జిల్లాలో భారీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప, నెల్లూరు సరిహద్దు నుంచి CS పురం వరకు 41 KM మేర 2 వరుసల హైవే, కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. మరోవైపు కడప ఉక్కుపై ప్రధాని స్పందించాలని పలువురు కోరుతున్నారు.
News October 16, 2025
పాలమూరు: నేడు PUలో 4వ స్నాతకోత్సవం

పాలమూరు వర్సిటీలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ.డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ Way2Newsతో ప్రత్యేకంగా తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొట్టమొదటిసారిగా గౌరవ డాక్టరేట్ను Dr.మన్నే సత్యనారాయణ రెడ్డికు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.