News March 31, 2025

రాచకొండ‌లో రంజాన్ భద్రతా ఏర్పాట్లు

image

రంజాన్ పండుగ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మసీదుల వద్ద వాహనాల నంబర్ ప్లేట్లు, పత్రాల చెకింగ్ నిర్వహించాలని, అవసరమైన ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్గా వంటి పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాంటీ సబోటేజ్ చెక్ టీమ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టారు.

Similar News

News November 23, 2025

భద్రాద్రి: రేపు డివిజన్ల వారీగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజల సౌకర్యార్థం రేపు భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇతర సమస్యలకు కలెక్టరేట్‌లోని ఇన్ వార్డ్ సెక్షన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News November 23, 2025

ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

image

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్‌కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.

News November 23, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్‌మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.