News January 30, 2025
రాచకొండ కమిషనరేట్లో గాంధీజీకి నివాళి

HYD: మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది రెండు నిమిషాల శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాంతియుత మార్గంలో ఎన్నో పోరాటాలు జరిపి దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నడిపి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.
Similar News
News November 30, 2025
హైకోర్టు: 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర జుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్ధతిలో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సివిల్ జడ్జిల పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను హై-కోర్టు వెబ్సైట్ http://tshc.gov.comని సంప్రదించవచ్చు.
SHARE IT
News November 30, 2025
HYD: ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు!

ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. HMDA అనుమతులు ఉన్నా సరే.. అవి ‘బిల్డ్ నౌ’ ఆన్లైన్ సైట్లో చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి విషయానికి కార్యాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘బిల్డ్ నౌ’ సైట్లో వివరాలు అప్డేట్ కాకపోవడంతో, అందుకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
News November 30, 2025
RRR నిర్మాణంలో కీలక పరిణామం

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 లేన్ రోడ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 161 కిలోమీటర్ల పనులకు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో నాలుగు లైన్లను నిర్మించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 లైన్స్ నిర్మించాలని కోరింది.


