News June 23, 2024
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఏ.వెంకటయ్యను కీసర ఎస్హెచ్ఓగా, కీసర SHOగా విధులు నిర్వహిస్తున్న కే.సీతారామ్ను కందుకూరు ఠాణాకు, కందుకూరు SHOగా పనిచేస్తున్న మక్బూల్ జానీని సైబర్ క్రైం విభాగానికి, యాదాద్రి ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కే.నాగరాజును మీర్పేట్ PSకు బదిలీ చేస్తునట్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. పోలైన ఓట్లలో 50.83 శాతం అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్కు పోల్ అవగా BRSకు 38.13 శాతం అంటే 74,259 ఓట్లు, BJPకి 8.76 శాతం అంటే 17,061 ఓట్లు పోలయ్యాయి. ఇక నోటాకు 0.47 శాతం అంటే 924 ఓట్లు పోలవగా నాలుగో స్థానంలో నిలిచింది. వన్ సైడ్గా ఓటర్లంతా తమ వైపే నిలిచారని, బస్తీ బిడ్డ నవీన్ యాదవ్కు పట్టం కట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్కు కలిసొచ్చిన MIM మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 16 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్కు ఈ ఉపఎన్నిక కలిసి వచ్చింది. కాగా ఈసారి కాంగ్రెస్కు అటు MIMతో పాటు TJS, CPI, CPM సహా పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు కూడగట్టడంలో CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరించడంతో ఆ పార్టీలు ఉపఎన్నికలో పోటీ చేయకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేశాయి. దీంతో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీ విజయం సాధించింది.
News November 14, 2025
16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా

జూబ్లీహిల్స్ గడ్డపై 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేసింది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన ఏడాదే ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014లో TDP, 2018లో TRS, 2023లో BRS గెలిచాయి. ఈ ఉపఎన్నికలో గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండాను నియోజకవర్గంలో ఎగరేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.


