News August 9, 2024
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల పుంగనూరులో జరిగిన టీడీపీ శ్రేణుల దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిరంతరం ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉండబోతుంది.
Similar News
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.
News November 21, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.
News November 21, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.


