News March 29, 2024
రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట TDP ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేయగా.. ఇందులో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రకటించింది. రాజంపేట వైసీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ టికెట్పై ఆశలు పెట్టుకున్న బత్యాలకు భంగపాటు ఏర్పడింది.
Similar News
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.


