News December 15, 2024
రాజంపేట: పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

రాజంపేటలో శనివారం రోడ్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. కిరణ్ పుట్టిన రోజు నాడే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News December 10, 2025
డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.
News December 10, 2025
డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.


