News April 2, 2025

రాజంపేట: రెవెన్యూ అధికారులకు శిక్షణ తరగతులు

image

రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ ఆడిటోరియంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట రెవెన్యూ అధికారులకు వివిధ చట్టాలపై 2వ ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రీ సర్వే ప్రగతి, మంజూరైన పొసెషన్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ పురోగతి, హౌస్ సైట్స్ రీవెరిఫికేషన్‌ పురోగతి, పెండింగ్‌లో ఉన్న భూమి అన్యాక్రాంతం, భూ సేకరణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Similar News

News October 31, 2025

UPDATE: నవ దంపతులను తీసుకొస్తుండగా యాక్సిడెంట్

image

హనుమకొండ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో <<18155214>>ముగ్గురు మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. బంధువులు తెలిపిన వివరాలిలా.. కురవి మండలం సూధనపల్లికి చెందిన యువతికి బుధవారం పెళ్లైంది. నవదంపతులను తీసుకొస్తుండగా గోపాలపురం వద్ద రోడ్డు పక్కకు ఆపిన వీరి బోలేరోను వేగంగా వచ్చిన బోర్ వెల్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కలమ్మ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News October 31, 2025

కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.

News October 31, 2025

గణపవరం తిరిగి ఏలూరు జిల్లాలోకి?

image

ఒక నియోజకవర్గం ఒకే డివిజన్‌లో ఉంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పడు గణపవరం మండల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఆ మండలం ఏలూరు జిల్లాలో కలిసే అవకాశముంది. గత ప్రభుత్వంలో తమకు భీమవరం దగ్గరని.. ఏలూరులో కలపొద్దని అక్కడి ప్రజలు కోరారు. దీంతో ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరులో కలిసినా గణపవరంను భీమవరం రెవెన్యూ డివిజన్లో ఉంచేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు మళ్లీ ఆందోళనలు చేపడుతున్నారు.