News February 5, 2025

రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలి: BHPL కలెక్టర్

image

రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికకు 215 మంది పురుషులు, 114 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: కొత్త యాజమాన్యాలు చేతికి మద్యం దుకాణాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు కొత్త యాజమాన్యాల నిర్వహణలోకి వచ్చాయి. Dec 1 నుంచి జిల్లాలోని 48 దుకాణాల నిర్వహణకు గత నెలలో టెండర్లు నిర్వహించగా, టెండర్ దక్కినవారు సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలో చాలా దుకాణాలు కొత్త వ్యాపారులకు దక్కగా, పాతవారికి కొందరికే అవకాశం లభించింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు వారికి గుడ్‌విల్ ఇచ్చి తిరిగి దుకాణాలను దక్కించుకున్నారు.

News December 1, 2025

జగిత్యాల: ‘వయోవృద్ధుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి’

image

సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

News December 1, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.