News February 5, 2025
రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలి: BHPL కలెక్టర్

రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికకు 215 మంది పురుషులు, 114 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 18, 2025
HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.
News February 18, 2025
SKLM: గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్ష

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2025
వీసా ఫ్రాడ్ ఆరోపణలు.. ఖండించిన TCS

దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లను US తీసుకెళ్లడానికి వారిని మేనేజర్లుగా చూపిస్తూ L-1A వీసాలను వాడుకుందని చెప్పారు. ఈ మేరకు అనిల్ కిని, మరో ఇద్దరు TCS మాజీ ఉద్యోగులు వ్యాజ్యాలు సైతం దాఖలు చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన TCS తమ కంపెనీ US చట్టాలకు కట్టుబడి పని చేస్తుందని వెల్లడించింది.