News December 11, 2024
రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటి..?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటనే సర్వత్రా చర్చ సాగుతుంది. వలిగొండలో సీఎం చేపట్టిన మూసీ ప్రక్షాళన యాత్రలో ఆయన కనిపించలేదు. నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విజయోత్సవ సభకు సైతం డుమ్మా కొట్టారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన సైలెంట్గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Similar News
News January 3, 2026
NLG: టీచర్లకు పరీక్ష.. విద్యార్థులకు బోధన ఎలా?

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.
News January 3, 2026
NLG: తొలగిన కష్టాలు.. పెరిగిన యూరియా కొనుగోళ్లు

జిల్లాలో యూరియా యాప్ ద్వారా బుకింగ్ విజయవంతంగా సాగుతుంది. యాప్ ప్రారంభంలో తొలి 2 రోజులు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత యాప్ బుకింగ్ లో సమస్యలు తొలగిపోవడంతో రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుంది. పది రోజుల్లో జిల్లాలో 34,579 మంది రైతులు లక్షకు పైగా యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.
News January 3, 2026
NLG: రేపటి నుంచి టెట్ పరీక్షలు షురూ

ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 6 రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణ కోసం నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 4, 8, 9, 11, 19, 20 తేదీల్లో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. 1,557 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.


