News March 12, 2025

రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

image

నిర్మల్‌ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్‌ కొండా గోవర్ధన్‌ ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్‌ అవేర్నెస్‌ ఆఫ్‌ గ్రాస్‌ రూట్‌ లెవెల్‌ లీడర్‌‌షిప్‌ ఇన్‌ ఆదిలాబాద్‌ డిస్ట్రిక్ట్‌ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్‌రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.

Similar News

News November 28, 2025

పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్‌లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
లాగిన్‌లో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్‌లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 28, 2025

NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

image

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.

News November 28, 2025

KNR: వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును సందర్శించిన డీఎంహెచ్ఓ

image

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న కుటుంబ నియంత్రణ వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డా.సనా జవేరియాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సలు చేసుకోబోతున్న, చేసుకున్న అర్హులైన దంపతులను కలిసి మాట్లాడారు. కరీంనగర్ ఆస్పత్రిలో 7, జమ్మికుంట సీహెచ్సీలో 6, మొత్తం 13 మందికి వ్యాసెక్టమీ చికిత్సలు జరిగాయన్నారు.