News June 11, 2024
రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో మృతి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బొట్ల వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
Similar News
News December 1, 2025
‘TCC పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

TG ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ TCC(టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆర్ట్ వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు తాడూరి లక్ష్మీనారాయణ సూచించారు. పూర్తి వివరాలకు www.bsetelangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన కోరారు.
News November 30, 2025
కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.
News November 30, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


